తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి ని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ ఉద్యమం సందర్భంగా గురువు పాత్ర పోషించిన పాశం యాదగిరి ఆ తర్వాతి కాలంలో కేసీఆర్ కు దూరంగా జరిగారు. టిఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాశం యాదగిరికి, ముఖ్యమంత్రి కేసీఆర్ కు దూరం మరింత పెరిగింది.
పాశం యాదగిరి టిజెఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ తో కలిసి నడుస్తున్నారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతిపై విశేషమైన సమాచారం పాశం యాదగిరి సొంతం. రవీంద్రభారతిలో తెలంగాణ కళలకు జరిగిన అవమానంపై ఆయన నిరసన వ్యక్తం చేశారు. తొమ్మిది నెలలుగా తెలంగాణ వారికి హాల్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ఆయనను అరెస్టు చేసి సైఫాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.