32.2 C
Hyderabad
March 28, 2024 22: 44 PM
Slider ఆధ్యాత్మికం

ద్వారకా తిరుమలలో ముగిసిన మహా పాశుపత హోమం

#dwaraka tirumla new

పశ్చిమగోదావరిజిల్లా ద్వారకా తిరుమల (చిన్నతిరుపతి)లో గత మూడు రోజులుగా జరుగుతున్న పాశుపత మహా మృత్యుంజయ హోమం నేడు ముగిసింది.

శనివారం నాడు అత్యంత వైభవంగా  ప్రారంభమైన ఈ హోం సోమవారం ఘనంగా ముగిసిందని ఈ ఓ జి వి సుబ్బారెడ్డి తెలిపారు.

సంతానం లేనివారి కోసం, వివాహం కాని వారి కోసం వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం పూర్వం నుండి ఈ హోమం ప్రత్యేకంగా నిర్వహిస్తుందని చెప్పారు.

లోక కళ్యాణం కోసం, ప్రజా శ్రేయస్సు దృష్ట్యా త్రయాహ్నిక దీక్ష తో స్వామివారి ఉప ఆలయమైన శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఆలయం లో పాశుపత మహా మృత్యు జయ హోమం నిర్వహించారు.

కరోనా నియమ నిబంధనలకు లోబడి భక్తులు  పాల్గొన్నారని ఈఓ జి వి సుబ్బారెడ్డి చెప్పారు.

Related posts

తనిఖీల్లో 2.5 లక్షల సీజ్.

Satyam NEWS

నిల్వ ఉన్న ఈ మద్యం అమ్మితే చాలు కరువు తీరుతుంది

Satyam NEWS

సైకోలా వ్యవహరిస్తున్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment