పశ్చిమగోదావరిజిల్లా ద్వారకా తిరుమల (చిన్నతిరుపతి)లో గత మూడు రోజులుగా జరుగుతున్న పాశుపత మహా మృత్యుంజయ హోమం నేడు ముగిసింది.
శనివారం నాడు అత్యంత వైభవంగా ప్రారంభమైన ఈ హోం సోమవారం ఘనంగా ముగిసిందని ఈ ఓ జి వి సుబ్బారెడ్డి తెలిపారు.
సంతానం లేనివారి కోసం, వివాహం కాని వారి కోసం వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం పూర్వం నుండి ఈ హోమం ప్రత్యేకంగా నిర్వహిస్తుందని చెప్పారు.
లోక కళ్యాణం కోసం, ప్రజా శ్రేయస్సు దృష్ట్యా త్రయాహ్నిక దీక్ష తో స్వామివారి ఉప ఆలయమైన శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఆలయం లో పాశుపత మహా మృత్యు జయ హోమం నిర్వహించారు.
కరోనా నియమ నిబంధనలకు లోబడి భక్తులు పాల్గొన్నారని ఈఓ జి వి సుబ్బారెడ్డి చెప్పారు.