తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ అనుబంధం గా కొనసాగుతున్న తెలంగాణ బ్రాడ్ స్టింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఎలక్ట్రానిక్ మీడియా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు పసుపుల శ్రీనివాస్ నియమితులయ్యారు.
మహబూబ్ నగర్ పట్టణంలోని వి వి కన్వెన్షన్ హాల్లో జిల్లా మహాసభలు నిర్వహించారు. పసుపుల శ్రీనివాస్ దాదాపుగా 20 ఏళ్లుగా జర్నలిజంలో కొనసాగుతూ గ్రామీణ ప్రాంతం నుంచి ఉమ్మడి జిల్లా బ్యూరో స్థాయి వరకు ఎదిగారు. ప్రస్తుతం యోయో టీవీలో మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి గా పనిచేస్తున్నారు.