27.7 C
Hyderabad
April 26, 2024 03: 08 AM
Slider ప్రత్యేకం

కూలగొట్టిన ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే రెడ్డిశాంతి

#patapatnammla

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నుండి ఒడిశాలోని మోహన ప్రాంతం వరకు నిర్మిస్తున్న 326(ఏ) హైవే విస్తరణ పనుల్లో భాగంగా తొలగించిన ఆలయాలను పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డిశాంతి ఆదివారంనాడు పరిశీలించారు. పాతపట్నంలోని రైల్వే స్టేషన్  సమీపంలోని ప్రధాన రహదారిపై ఉన్న రైల్వే ట్రాక్ పై ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల్లో భాగంగా  ఉత్కలాంధ్రుళ ఆరాధ్య దైవం శ్రీ నీలమణి దుర్గా ఆలయ ముఖ ద్వార కొద్ది భాగం తొలగించిన విషయం తెలిసిందే. అదే విధంగా సమీపంలోని ఆంజనేయ స్వామి ఆలయం పూర్తిగా తొలగించారు. పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డిశాంతి ఘటనా స్థలాల్ని ఆదివారం పరిశీలించారు. ఆమెతో పాటు డీఎస్పీ ఎమ్.శ్రావణి,పోలీస్ అధికారులు,సిబ్బంది, తహసీల్దార్ ఎమ్.కాళీ ప్రసాద్,జెడ్పీటీసీ లింగాల ఉషారాణి,వైస్ ఎంపీపీ ప్రదీప్ ఆలయ ఈవో వాకచర్ల రాధాకృష్ణ తదితరులు ఉన్నారు.

Related posts

జూన్ నాటికి ప్రాధాన్య‌తా భ‌వ‌నాల‌ను పూర్తవ్వాలి…!

Bhavani

రష్యాకు ఆయుధాలు సరఫరా చేసేవారిపై కట్టడి చర్యలు

Satyam NEWS

సిబిఐటి  లో ఘనంగా శృతి – 2023 ప్రారంభం

Satyam NEWS

Leave a Comment