ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రానికి చెందిన కాంబ్లీ మాధవ్ (25) అనే రోగి అదిలాబాద్ జిల్లా కేంద్రంలోనీ రిమ్స్ హాస్పిటల్ మూడో అంతస్తు నుంచి దూకి శనివారం ఉదయం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
తీవ్ర గాయాల పాలైన రోగి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. కాంబ్లీ మాధవ్ లివర్ సమస్యతో బాధపడుతు ఈ నెల 18న ఉట్నూర్ ఏరియా హాస్పిటల్ నుంచి రిమ్స్ లో చేరాడు.
కాగా గత నెలలో ఇలాంటి ఘటనలే రెండు చోటు చేసుకున్నాయి. మూడు నెలల్లో రిమ్స్ లో మూడు సంఘటనలు జరగడం రిమ్స్ హాస్పిటల్ భద్రత తీరు ను ప్రశ్నిస్తుంది.