నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పాజిటివ్ ను గెలిచిన వారికి ఆసుపత్రి నుండి వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి చప్పట్లు కొడుతూ ఆస్పత్రి సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు.
ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమ రాజ్ మాట్లాడుతూ కోవిడ్19 పాజిటివ్ వచ్చినవారు ఏమాత్రం సంకోచించకుండా ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి నాణ్యమైన వైద్యం చేయించుకొని జబ్బును నయం చేసుకోవచ్చని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల కోసం ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని విధాల సౌకర్యాలను కల్పిస్తూ వారిని తిరిగి కోలుకునే విధంగా కృషి చేసే దిశగా ఆసుపత్రి సిబ్బంది ఎల్లవేళల కృషి చేస్తున్నారని ఆమె తెలిపారు.
కోవిడ్19 బాధితులు తమకు ఏదో జరుగుతుంది అనే భయం ఆందోళన చెందకుండా ఆత్మస్థైర్యంతో ధైర్యంగా ఉంటే కోవిడ్ 19 ని జయించవచ్చని సూపరిండెంట్ డాక్టర్ ప్రతి మహారాజ్ అన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ జగన్ తిరుపతిరావు ఆర్ ఎం ఓ లు తదితరులు పాల్గొన్నారు.