28.7 C
Hyderabad
April 20, 2024 08: 22 AM
Slider మహబూబ్ నగర్

పట్టణ ప్రగతి ప్రోగ్రాంలో మనమే ముందుండాలి

kollapur pattana pragathi

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, వార్డు లోని పరిసర ప్రాంతాలల్లో ప్రగతి కనిపించాలని, ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి ఆదేశించారు. బుధవారం కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు లో ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి పర్యటించారు.

ఈ సందర్భంగా పట్టణ ప్రగతిపై ఆరా తీశారు. ప్రణాళిక ను పరిశీలించారు. వార్డు లోని అపరిశుభ్రతను పరిశీలించారు. అనంతరం  ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాని విజయవంతం చేయాలని అన్నారు. అదేవిధంగా మన ప్రాంతాన్ని పరిశుభ్రత ఉంచుకోవడమే పట్టణ ప్రగతి అన్నారు. ప్రజలలో చైతన్యం రావాలని ఆ విధంగా కౌన్సిలర్స్  మున్సిపల్  అధికారులు కృషిచేయలన్నారు.

ముఖ్యమంత్రి సంకల్పాన్ని నెరవేర్చవలసిన బాధ్యత  ప్రతి ఒక్కరికి ఉండాలన్నారు. పట్టణ ప్రగతిలో కొల్లాపూర్ మున్సిపాలిటీ మొదటి స్థానంలో నిలవాలన్నారు. ఆ విధంగా ప్రతి ఒక్కరు పని చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి, కమిషనర్ వెంకటయ్య, ప్రభుత్వ ఆసుపత్రి చైర్మన్  జంబులయ్య, సింగిల్విండో చైర్మన్ పెబ్బేటి కృష్ణయ్య, చంద్రశేఖర చారి, మండల నాయకులు ముచ్చర్ల రాంచందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

మదనపల్లి మార్కెట్ లో కిలో 130 తాకిన టమాటా

Satyam NEWS

టిటిడి ఈఓ ఏవి.ధర్మారెడ్డి కి మంత్రి రోజా పరామర్శ

Bhavani

వైభవంగా భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు

Satyam NEWS

Leave a Comment