ఎల్లారెడ్డి పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో ఆదివారం ఎమ్మెల్యే జాజాల సురేందర్ లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం పట్టణ ప్రగతి పనులను పర్యవేక్షించారు. 3, 8 వార్డులను సందర్శించి తడి చెత్త, పొడి చెత్త వేయడానికి వేరువేరు డబ్బాలని ప్రజలకి అందించారు.
3 వ వార్డు లో ప్రజల సమస్యల పై స్పందించి దోమలు బెడద లేకుండా చేస్తామని, చెత్తని బయట వేయకుండా మున్సిపల్ వాహనాల్లో వేయాలని తెలిపారు. 8 వ వార్డులో పర్యటించి స్పెషల్ ఆఫీసర్ ని అడిగి సమస్యలు తెలుసుకొని సమస్య స్థలాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా ప్రజలు కూడా అధికారులకి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యం, సర్పంచులు, పీఏసీఎస్ చైర్మన్ ఎగుల నర్సింలు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.