27.7 C
Hyderabad
March 29, 2024 04: 19 AM
Slider నిజామాబాద్

ఎల్లారెడ్డిలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణి

yellareddy

ఎల్లారెడ్డి పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో ఆదివారం ఎమ్మెల్యే జాజాల సురేందర్ లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం పట్టణ ప్రగతి పనులను పర్యవేక్షించారు. 3, 8 వార్డులను సందర్శించి తడి చెత్త, పొడి చెత్త   వేయడానికి వేరువేరు డబ్బాలని ప్రజలకి అందించారు. 

3 వ వార్డు లో ప్రజల సమస్యల పై స్పందించి దోమలు బెడద లేకుండా చేస్తామని, చెత్తని బయట వేయకుండా మున్సిపల్ వాహనాల్లో వేయాలని తెలిపారు. 8 వ వార్డులో పర్యటించి స్పెషల్ ఆఫీసర్ ని అడిగి సమస్యలు తెలుసుకొని సమస్య స్థలాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా ప్రజలు కూడా  అధికారులకి  సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యం,  సర్పంచులు, పీఏసీఎస్ చైర్మన్ ఎగుల నర్సింలు,  కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

సీఎం రాజీనామా

Bhavani

భారత్ లో కొత్తగా 2,876 కరోనా కేసులు 98 మరణాలు

Sub Editor 2

అంకితా భండారీ మృతదేహం వెలికితీత

Satyam NEWS

Leave a Comment