32.7 C
Hyderabad
March 29, 2024 11: 07 AM
Slider ఆంధ్రప్రదేశ్

ఛాలెంజ్:ఈప్రభుత్వాన్ని కూల్చేంతవరకు నిద్రపోను

pavan meeting

ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ పార్టీ కి నాశన కాలం మొదలైందని జగన్ ప్రభుత్వాన్ని కూల్చేంత వరకు తాను నిద్రపోనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్వై ప్రతిన బూనారు.మంగళగిరిలో మాట్లాడుతూ ఆయనమాట్లాడుతూ అమరావతికి భూములు ఇచ్చిన ఆడపడుచుల చేత కన్నీరు పెట్టించారని వారి శాపాలు ఊరికే పోవని ఆవేదన వ్యక్తం చేశారు.ఏపీలో వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు అంతు లేకుండా పోయిందని మండిపడ్డారు. ప్రజల ఆకాంక్షలను పక్కనపెట్టి, నిరంకుశ ధోరణితో పాలిస్తున్నారని అన్నారు.


ఫ్యాక్షన్ తరహా రాజకీయాలు చేయాలని వైసీపీ చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు తీసుకుంటున్న నిర్ణయాలు వారి వినాశనం కోసమేనని చెప్పారు. వైసీపీకి ఇదే తొలి, చివరి అధికారమని… ఇకపై వారికి రాష్ట్రంలో అధికారం ఉండదని అన్నారు. రాజధానిని అమరావతి నుంచి ఎవరూ తరలించలేరని చెప్పారు. నమ్మి ఓట్లు వేస్తే వైసీపీ మోసం చేస్తోందని మండిపడ్డారు.

Related posts

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోలుకోవాలని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు

Satyam NEWS

ముదిరాజులకు ప్రభుత్వం ఆర్థిక బంధు ప్రకటించాలి

Satyam NEWS

జనసేన అత్తిగారి దినేష్ ఆధ్వర్యంలో రంజాన్ ఇఫ్తార్ విందు

Satyam NEWS

Leave a Comment