27.7 C
Hyderabad
April 20, 2024 02: 31 AM
Slider అనంతపురం

కౌలు రైతు కుటుంబానికి పవన్ కళ్యాణ్ అండ….

#pavankalyan

అనంతపురం జిల్లా కొత్త చెరువులో జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర ప్రారంభమైంది. యాత్రలో భాగంగా ఇటీవల సాగు నష్టం, ఆర్ధిక ఇబ్బందులు కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతు  సాకే రామకృష్ణ  కుటుంబ సభ్యులను జన సేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  పరామర్శించారు.

పార్టీ తరఫున లక్ష రూపాయలు ఆర్ధిక సాయం ఆయన భార్య సాకే సుజాతకు అందజేశారు. పార్టీ తరఫున అన్ని రకాలుగా కుటుంబానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా  పవన్ కళ్యాణ్ గారు భరోసా ఇచ్చారు.  పవన్ కళ్యాణ్ తో పాటు పార్టీ పీఏసీ ఛైర్మన్  నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యులు నాగబాబు, చిలకం మధుసూదన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు  టి.సి. వరుణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రామకృష్ణ చనిపోయిన తరువాత తమ కుటుంబాన్ని ఎవరూ పట్టించుకోలేదని, ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదని ఈ సందర్భంగా సుజాత పవన్ కళ్యాణ్ కి తెలిపారు.

Related posts

దేశంలోని మహిళలకు పెద్దన్నలా నిలిచిన నరేంద్రమోడీ

Satyam NEWS

దేశ సమైక్యతకు పి.వి ఎనలేని కృషి

Satyam NEWS

వివాహ వేడుకలలో పాల్గొన్న సీనియర్ నేత జూపల్లి

Satyam NEWS

Leave a Comment