పచ్చిబూతులు తిట్టి, కారణం లేకుండా దాడులు చేస్తే పోలీసులు చోద్యం చూస్తూ కూర్చోవడం క్షమించరానిదని ప్రజాప్రతినిధి ఇలాంటి అద్వాన్న భాష మాట్లాడతారా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.కాకినాడలో ఆయన మాట్లాడారు. కారకులపై సుమోటో చర్య తీసుకోవాలని అన్నారు. ఎమ్మెల్యేపై పోలీసులు ఎందుకు కేసు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు.
ఎమ్మెల్యే దిగి వచ్చారనుకుంటున్నారా అని ఆయన అన్నారు.ఇంకా నియంత్రణలోనే ఉన్నామని, పోలీసు శాఖ కాని, ఉన్నతాదికారులకు కాని ,ఇంకొక్క సంఘటన జరిగితే ,మా వాళ్ల పై చేయివేస్తే .నేను చేతులు ముడుచుకుని కూర్చోనని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.తాము బాద్యత గా రాజకీయాలు చేస్తున్నామని ఆయన చెప్పారు.వైసిపి ప్రతినిదులు అకారణంగా గొడవలు చేసి, . సభ్య సమాజంలో ప్రజా ప్రతినిదిగాఉండి ఉపయోగించకూడని భాష ఉపయోగిస్తున్న తీరు అభ్యంతరకరమని ఆయన అన్నారు.
అందుకు నిరసనగా జనసేన కార్యకర్తలు ఆందోళన చేస్తే దానిపై వైసిపి కార్యకర్తలు వ్యవహరించిన వైనం పద్దతిగా లేదని అన్నారు. వాళ్లు తిడితే తమ వాళ్లపై కేసులు పెడతారా అని ఆయన అన్నారు.పోలీసు లు చోద్యం చూసినట్లు వ్యవహరించడం బాగోలేదని అన్నారు. మా సహనం చేతకాని తనం కాదని అన్నారు. శాంతి భద్రతల సమస్యను సృష్టించాలనుకుంటే మీరు ఎవరూ ఇక్కడ ఉండలేరని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. అమరాతి రైతుల కోసం ప్రదర్శన చేద్దామనుకుంటే అసాంఘీక శక్తులు వస్తాయని పోలీసులు చెప్పారని ,అంటే మాకు నిరసన కు హక్కు లేదా అని ఆయన అన్నారు. వైసిపి అదికారంలోకి వస్తే పాలెగాళ్ల రాజ్యం వస్తుందని అన్నామని ,అదే జరిగిందని అన్నారు.
పచ్చిబూతులు తిట్టి, కారణం లేకుండా దాడులు చేస్తే పోలీసులు చూస్తూ కూర్చోవడం క్షమించరానిదని ఆయన అన్నారు. కారకులపై సుమోటో చర్య తీసుకోవాలని అన్నారు. ఎమ్మెల్యేపై పోలీసులు ఎందుకు కేసు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు.ఎమ్మెల్యే దిగి వచ్చారనుకుంటున్నారా అని ఆయన అన్నారు.ఇంకా నియంత్రణలోనే ఉన్నామని, పోలీసు శాఖ కాని, ఉన్నతాదికారులకు కాని ,ఇంకొక్క సంఘటన జరిగితే ,మా వాళ్ల పై చేస్తే.నేను చేతులు ముడుచుకుని కూర్చోనని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.తాము బాద్యత గా రాజకీయాలు చేస్తున్నామని ఆయన చెప్పారు.