32.2 C
Hyderabad
March 29, 2024 01: 02 AM
Slider ఆధ్యాత్మికం ఆంధ్రప్రదేశ్

కృష్ణానదిలో కార్తీక మాసం సందర్భంగా పవిత్ర హారతి

pavitra harati

కార్తీక మాసం సందర్భంగా కృష్ణా నదిలో పవిత్ర హారతి కార్యక్రమాన్ని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. అదే విధంగా దుర్గా ఘాట్ వద్ద పవిత్ర హారతుల సమయంలో దేవస్థానం వారి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మల్లీశ్వరాలయం వద్ద కార్తీక మాసం సందర్భంగా ప్రతి రోజు సాయంత్రం జరుగుచున్న సహస్ర లింగార్చన సేవను అర్చక సిబ్బంది నిర్వహించగా భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదములు స్వీకరించారు. మహామండపం 7 వ అంతస్థులో ఊంజల్ సేవ(దీపారాధన సేవ) ను దేవస్థాన అర్చక సిబ్బంది వైభవంగా నిర్వహించారు. ఈ సేవ నందు పలు ప్రాంతాకు చెందిన భక్తులు పాల్గొని దీపాలు వెలిగించారు.

Related posts

తెరుచుకున్న శబరిమల ఆలయం

Satyam NEWS

తైక్వాండో చాంపియన్‌షిప్‌లో సత్తా చూపండి

Satyam NEWS

చారిత్రక ప్రదేశంగా రాజుల కాలం నాటి అతి పురాతన లింగంబావి

Satyam NEWS

Leave a Comment