పవిత్రోత్సవాలకు ముస్తాబవుతున్న మట్టపల్లి మహా క్షేత్రం
ఈనెల 23వ,తేదీ నుండి 26వ,తేది వరకు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండల మట్టపల్లి మహా క్షేత్రంలో నెలవైన స్వయంవ్యక్త శ్రీ లక్ష్మీనృసింహ స్వామి వారి పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు,దేవస్థాన ఈఓ మాట్లాడుతూ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి 23వ,తేదీ శుక్రవారం అంకురార్పణ,25వ,తేదీ దేవతా స్థాపన,26న,శ్రీ లక్ష్మీనృసింహ స్వామి వారి శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు.భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్