కరోనా బారినపడిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కరోనా నుంచి కోలుకున్నారు. ఆయనకు వైద్య సేవలు అందించిన డాక్టర్లు మూడు రోజుల కిందట ఆర్.టి.పి.సి.ఆర్. పరీక్షలు నిర్వహించారు.
ఆ పరీక్షల్లో పవన్ కల్యాణ్ కు కరోనా నెగెటివ్ వచ్చింది.
కరోనా అనంతరం వచ్చే నీరసం మాత్రమే ఉంది. ఆరోగ్యపరంగా పవన్ కల్యాణ్ కి ఇబ్బందులు లేవని ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్న వైద్యులు తెలియచేశారు.
తన ఆరోగ్యం కోసం పూజలు, ప్రార్థనలు చేసిన జనసైనికులు, నాయకులు, అభిమానులకు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలియచేశారు.
ప్రస్తుతం దేశంలో కోవిడ్ ప్రభావం తీవ్రస్థాయిలో ఉన్నందున ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని, వైద్య నిపుణులు అందిస్తున్న సూచనలు అనుసరించాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు.