39.2 C
Hyderabad
March 28, 2024 14: 20 PM
Slider పశ్చిమగోదావరి

కౌలు రైతు కుటుంబానికి పవన్ కళ్యాణ్ రూ.లక్ష ఆర్ధిక సాయం

#pawankalyan

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం ధర్మాజీగూడెం ప్రాంతానికి చెందిన కౌలు రైతు దాసరి రాజారావు ఆర్థిక ఇబ్బందులతో మూడేళ్ల క్రితం బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆరు ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసి అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నారు.

జనసేన కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ధర్మాజీగూడెంలో రాజారావు కుటుంబాన్ని ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. రాజారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. జనసేన పార్టీ తరఫున ప్రకటించిన రూ. లక్ష  ఆర్థిక సాయాన్ని చెక్ రూపంలో ఆయన తల్లిదండ్రులు మరియమ్మ, సుశీలకు అందజేశారు.

రాజారావు కుమారుడు అఖిల్ విద్య బాధ్యతలను జనసేన పార్టీ తీసుకుంటుందని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ తో పాటు పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యులు నాగబాబు, జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, పార్టీ నాయకులు ఘంటసాల వెంకట లక్ష్మీ, బొమ్మిడి నాయకర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

బ్లాస్టింగ్ డెత్:గ్యాస్‌ తయారీ పరిశ్రమలో పేలుడు 5గురు మృతి

Satyam NEWS

వైకాపా నాయకుడిపై వైకాపా నేతల ఫిర్యాదు

Bhavani

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు

Satyam NEWS

Leave a Comment