కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం పరిధిలోని టి.సుండుపల్లి మండలంలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న నిరుపేదలకు ఆదివారం జనసేన నేతలు ఆహారం ప్యాకెట్లు పంపిణీ చేశారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరుపేదలకు భోజనం ప్యాకెట్లు పంపిణీ చేయడంతోపాటు పండ్లను జనసేన పార్టీ నాయకుడు రామ శ్రీనివాసులు అందజేశారు.
పెద్ద బలిజపల్లి యూత్ సహకారం తో ఈ కార్యక్రమం చేపట్టారు. అదే విధంగా పరిసర పలు గ్రామాలలో పండ్లు పంపిణీ చేశారు. కరోనా వైరస్ కారణంగా ఎంతోమంది నిరుపేదలు ఆకలితో అలమటిస్తున్నారని తమ శక్తి మేరకు వారికి సహాయం చేసినట్లు తెలిపారు.