గండ్లు పడ్డ కొండపోచమ్మ సాగర్ కాలువను పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలో నిన్న గండ్లు పడ్డ కొండపోచమ్మ సాగర్ కాలువకు పలు చోట్ల గండ్లు పడ్డాయి.
గండ్లు పరిశీలనకు టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్, ఎమ్యెల్సి జీవన్ రెడ్డి, ఎమ్యెల్యే శ్రీధర్ బాబు, టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షులు పొన్నం, డీసీసీ అధ్యక్షులు నర్సారెడ్డి వచ్చారు. గండ్లు పడిన విధానాన్ని వారు పరిశీలించారు.
అదే విధంగా ముంపునకు గురైన వెంకటపూర్ గ్రామాన్ని సందర్శించి ప్రజలతో మాట్లాడారు.