38.2 C
Hyderabad
April 25, 2024 12: 46 PM
Slider మెదక్

పిఎసీఎస్ లలో అవినీతి, అక్రమాలపై సి.బి.ఐ విచారణ జరపాలి

#allparty

సిద్దిపేట, జనగామ నియోజకవర్గాల్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్), ఐకేపీ సెంటర్లలో జరిగిన అవినీతి, అక్రమాలపై సీబీఐ పూర్తిస్థాయి విచారణ జరపాలని అఖిలపక్ష నాయకులు విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్, సివిల్ సప్లయీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.  రైతేరాజు అని గొప్పలు చెప్పుకొంటున్న సీఎం కేసీఆర్ స్వంత జిల్లాతోపాటు, జనగామ జిల్లాలో కూడా ఇంత పెద్ద అవినీతి జరగడంపై టిఆర్ఎస్ ప్రభుత్వం జవాబు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. పండించిన పంటలు అమ్ముకోవడానికి ఒకవైపు రైతులు ఎన్నో పాట్లు పడుతుంటే.. మరోవైపు టీఆర్ఎస్ నాయకులు ఇలాంటి అవినీతి, అక్రమాలతో రైతుల సొమ్ము దోచుకుంటున్నారని వారు విమర్శించారు.

అఖిలపక్షంలో మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ పుర్మ ఆగం రెడ్డి, మాజీ జడ్పిటిసి కొమ్ము నర్సింగ్ రావు, కౌన్సిలర్ చెవిటి లింగం, అంకుగారి శశిధర్ రెడ్డి, బుట్టి బిక్షపతి, ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ అందె బీరన్న, అందె అశోక్, రాచకొండ నాగరాజు సీపీఐ, ఒగ్గు రాజు టీడీపి మండల నాయకులు, ప్రసాద్ ఎం.ఎస్.పి., భీమయ్య తదితరులు ఉన్నారు.

జనగామలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అనుచరులే కోట్లాది రూపాయల అక్రమాలు చేశారని వారు ఆరోపించారు. పీఏసీఎస్ చైర్మన్ వంగ చంద్రారెడ్డి వ్యాపారస్తులతో కలిసి, మిల్లు యజమానులతో కుమ్మక్కై రూ. 3 కోట్ల 22 లక్షల పైచిలుకు అవినీతి చేశారన్నారు. 65 మంది బినామీ వ్యక్తుల పేర్లు పెట్టి, డబ్బు డిపాజిట్ చేసి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. నకిలీ ట్రక్ షీట్లు సృష్టించి రైతుల పేర కాకుండా టిఆర్ఎస్ నాయకుల అకౌంట్లలో కోట్లాది రూపాయలు జమ చేశారన్నారు. చేర్యాల సొసైటీలో జరిగిన అవినీతి అక్రమాలపై సి.బి.ఐ పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని, రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తరుగు పేరుతో రైతులకు కోత విధించి సొమ్ము చేసుకున్నారు

చేర్యాల, కడవేర్గు,రసూలాబాద్ సెంటర్లలో ప్రధానంగా అవినీతి జరిగిందన్నారు. తరుగు పేరుతో 5 కేజీల వరకు రైతుల బస్తాల నుండి కోత విధించి సొమ్ము చేసుకున్నారని అన్నారు. టీఆర్ఎస్ నాయకులే సూత్రధారులుగా ఉన్నారని అన్నారు. వీరు అక్రమంగా, బినామీ వ్యక్తుల బ్యాంకు అకౌంట్లలో నేరుగా డబ్బులు జమ చేయడం సిగ్గుమాలిన చర్య అని విమర్శించారు.

అలాగే, ఐకెపి సెంటర్లలో కూడా భారీ ఎత్తున అవినీతి జరిగిందని , కొమురవెల్లి ,చేర్యాల మద్దూరు,ధూల్మిట్ట మండలాల్లోని ఐకెపి సెంటర్లపై ఏకకాలంలో దాడులు చేస్తే, అవినీతి- అక్రమాలన్నీ వెలుగులోకి వస్తాయన్నారు.

 ఒక్క కొమురవెల్లి మండలంలోనే ఐకేపీ 10 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, వీటిలో 3 కేంద్రాలను చేర్యాల సొసైటీ నిర్వహించిందన్నారు. మిగతా 4 కేంద్రాలలో 2,356 మంది రైతుల నుంచి 1,05,72,440 కేజీల ధాన్యాన్ని 26,431 బస్తాల్లో ఐకెపి సేకరించిందన్నారు. మర్రిముచ్చాల  ధాన్యం కేంద్రం నుండి 14 ఖాళీ ట్రక్ షీట్లను చేర్యాలలోని రైస్ మిల్లుకు  ఒక్కొక్కటి అమ్మకుంటున్నట్లు విచారణలో తేలిందన్నారు. ఒక ట్రక్ షీట్ ద్వారా ఒక లారీకి ఐదు లక్షల నుండి ఆరు లక్షల వరకు ధాన్యం వెళుతుందన్నారు. కానీ ట్రాక్ షీట్ మాయాజాలం వల్ల లక్షలాది రూపాయల అవినీతి జరిగిందని వారు ఆరోపించారు. చేర్యాల, మద్దూరు మండలాల్లో జరిగిన విధంగానే  జనగామ, బచ్చన్నపేట, నర్మెట మండలాల్లో కూడా అవినీతి జరిగిందని రైతులు భావిస్తున్నారన్నారు.

 అందుకే, సిద్దిపేట జిల్లాలో ఉన్న మండలాల్లో, జనగామ జిల్లాలో ఉన్న మండలాల్లో అన్ని పిఎసిఎస్ , ఐకెపి సెంటర్లపై ఎంక్వైరీ చేయించి రైతులకు మేలు చేయాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. ఈ విషయంలో  ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తన చిత్తశుద్ధిని ప్రదర్శించి పారదర్శకంగా ఎంక్వయిరీ చేయించకపోతే ఆయనే సూత్రధారిగా భావించాల్సి వస్తుందన్నారు.

ఈ కుంభకోణంలో కేసులైన 19 మందిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రోజులు గడుస్తున్నా నలుగురిని మాత్రమే రిమాండ్ కు పంపి, మిగతా వారిని ఇంకా అదుపులోకి తీసుకోక పోవడం అంటే.. పోలీసు అధికారులు, టిఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం కాదా ? అని వారు ప్రశ్నించారు. ఈ అవినీతి,అక్రమాలపై పోరాటాలు, ఉద్యమం ఉధృతం చేస్తామని అఖిలపక్ష నేతలు హెచ్చరించారు.

Related posts

ఎంఎల్సీ ఎన్నికలకు జేడ్పీ హెచ్ సీ పోలింగ్ కేంద్రంపై పోలీసు బాస్ దృష్టి

Satyam NEWS

ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ను కలిసిన ఏపీయూడబ్ల్యూజే…!

Satyam NEWS

ఫ్రేమోన్మాధి ఘాతుకం

Murali Krishna

Leave a Comment