నంద్యాల జిల్లాలో 24 మంది పై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఈ వివరాలను కర్నూల్ రేంజ్ డీఐజీ ఎస్. సెంథిల్ కుమార్, నంద్యాల జిల్లా ఎస్పి రఘువీర్ రెడ్డి కర్నూల్ రేంజ్ డీఐజీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు.
ఈ సమావేశంలో డిఐజి మాట్లాడుతూ నంద్యాల జిల్లా ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 24 మందిని PD ACT కింద కడప సెంట్రల్ జైలుకు పంపినట్లు చెప్పారు. వివిధ నేరాలకు పాల్పడిన వారు తమ పద్ధతులు మార్చుకోకుండా మళ్లీ మళ్లీ నేరాలకు పాల్పడుతూ ఉంటే వారిపై PD ACT కింద కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.