అత్యాచారాలు, నేరాలు చేస్తున్న గద్దల రమేష్ పై రామగుండం పోలీసులు పీడీ యాక్ట్ అమలు చేశారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన గద్దల రమేష్ కు పలు నేరాలతో సంబంధం ఉందని పోలీసులు తెలిపారు.
2019 నుండి ఇప్పటి వరకు వరకు అతను ఆరు నేరాలు చేశాడు. నేరాలను నియంత్రించడంతో పాటు ప్రజల ఆస్తులకు భద్రత కల్పించడం పోలీసుల కర్తవ్యం, ఇందులో భాగంగా ప్రజల భయాందోళనలకు గురిచేసే వారిపై కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని, ఇకపై ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ క్రింద కేసులను నమోదు చేయడం జరుగుతుందని రామగుండము పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.
పీడీ యాక్ట్ అమలు చేసేందుకు కృషి చేసిన ఏసీపీ జైపూర్ నరేందర్, శ్రీరాంపూర్ సిఐ బిల్లా కోటేశ్వర్ ,జైపూర్ ఎస్ఐ రామకృష్ణ లను సిపి అభినందించారు.