36.2 C
Hyderabad
April 18, 2024 11: 02 AM
Slider ఆదిలాబాద్

మట్కా ఆడిన వ్యక్తిపై పిడి చట్టం ప్రయోగించిన పోలీసులు

#pd act

మట్కా ఆడిన వ్యక్తిపై కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పోలీసులు పిడి చట్టం ప్రయోగించారు.

జిల్లా ఇంచార్జ్ ఎస్పీ రామగుండం కమీషనర్ సత్యనారాయణ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ అడ్మిన్ వైవీఎస్ సుధీంద్ర, కాగజ్ నగర్ ఏఎస్పీ బాల స్వామి పర్యవేక్షణలో మంగళవారం రోజున అబ్దుల్ జావీద్ అనే మట్కాఆడే వ్యక్తి పై టౌన్ ఇన్స్పెక్టర్ మోహన్ పీడీ చట్టం నమోదు చేసారు.

అబ్దుల్ జావీద్ గత కొద్ది కాలంగా అమాయక ప్రజలను మట్కాతో మోసం చేస్తున్నాడు. మట్కా ఆడితే బాగా డబ్బులు వస్తాయని మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నాడు.

మట్కా ఆడేందుకు అలవాటు పడి ఎన్ని కేసులు పెట్టినా కూడా అతని ప్రవర్తనలో మార్పు రాక పోయేసరికి పిడి చట్టం ప్రయోగించారు.

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాలు జారి చేయగా పోలీసులు అతడిని అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు పంపారు.

త్వరలోనే మట్కా అడే మరి కొందరిపైన కూడా పీడీ ఆక్ట్ క్రింద కేసులు నమోదు చేస్తామని ఎస్. హెచ్. ఓ డీ. మోహన్  హెచ్చరించారు.

Related posts

డ్రంక్ అండ్ డ్రైవ్ పై విజయనగరం పోలీసులు అలెర్ట్…….!

Satyam NEWS

విజయనగరంలో ఈ నెల 22 నుంచి యువజనోత్సవాలు

Satyam NEWS

జీవీఎంసీ కమిషనర్ సృజన అర్ధరాత్రి బదిలీ

Satyam NEWS

Leave a Comment