చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే రౌడీ షీటర్లపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని ఖమ్మం అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ సుభాష్ చంద్ర బోస్ హెచ్చరించారు. పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ ఆదేశాలతో ఖమ్మం డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో రికార్డులలో నమోదు అయి వున్న రౌడీ షీటర్లకు ఖమ్మం టౌన్ ఏసీపీ కార్యాలయం కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ మాట్లాడుతూ …ఖమ్మం కమీషనరేట్ పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా, ప్రజల స్వేచ్ఛకు భంగం కలిగేలాగా ప్రవర్తించినా, భూకబ్జాలు సెటిల్మెంట్లలో తలదూర్చినా, అల్లర్లు సృష్టించినా, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అసాంఘిక, ఆవాంచనీయ సంఘటనలకు పాల్పడితే ఎలాంటి వారినైనా వదిలిపెట్టేది లేదని అన్నారు.
అదేవిధంగా నేరస్తులు, రౌడీషీటర్ల కదలికలపై నిరంతరం పూర్తి నిఘా పెంచడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం టౌన్ ACP .B.ఆంజనేయులు, ఖమ్మం టౌన్ డివిజన్ ఇన్స్పెక్టర్స్ N.చిట్టిబాబు , T.కరుణాకర్,.Ch.శ్రీధర్, U.వెంకన్నబాబు లు పాల్గొన్నారు.