పక్కా సమాచారంతో అక్రమ రవాణా అవుతున్న 130 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని నల్గొండ జిల్లా మల్లేపల్లి పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు.
ఆదివారం తమకు అందిన పక్కా సమాచారం మేరకు పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా అవుతున్న విషయం తెలిసి తనతో పాటు ఎస్.ఐ. భాస్కర్ రెడ్డి, సిబ్బంది కలిసి దాడులు నిర్వహించగా 130 క్వీంటాళ్ల పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న విషయాన్ని నిర్ధారించినట్లు సిఐ పరుశురాం తెలిపారు.
మొత్తం 18 మంది వ్యక్తులను, ఐదు ద్వి చక్ర వాహనాలను, రెండు తుఫాన్ వాహనాలు, రెండు మహేంద్రా బొలెరో వాహనాలతో పాటు ఒక అశోకా లేల్యాండ్ వాహనం, టాటా ఇండికా కారును సీజ్ చేసి కేసు నమోదు చేశామని వివరించారు.
సమాచారం తెలిసిన వెంటనే స్పందించిన తమను జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్, దేవరకొండ డిఎస్పీ ఆనంద్ రెడ్డిలు అభినందించారని ఆయన తెలిపారు. తన ఆధ్వర్యంలో జరిగిన దాడులలో ఎస్.ఐ. భాస్కర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది గణేష్, విజయ్, కాశయ్య తదితరులు పాల్గొన్నారని సిఐ పరుశురాం చెప్పారు.