38.2 C
Hyderabad
April 25, 2024 13: 55 PM
Slider తూర్పుగోదావరి

చౌకబియ్యం పాలిష్ చేసి దొంగ మార్కెట్ కు తరలింపు

#pdsrice

పిడిఎస్ బియ్యం పాలిష్ చేసి దొంగ మార్కెట్ లో అమ్ముకుంటున్న రైస్ మిల్లును విజిలెన్సు అధికారులు సీజ్ చేశారు. కోనసీమ జిల్లా కాట్రేనికోన మండల పల్లంకురు గ్రామ పంచాయతీ పరిధిలో గల రైస్ మిల్ కు మినీ అశోక్ లేలాండ్ వ్యాన్ పై పిడిఎస్ బియ్యం తీసుకురాగా విజిలెన్స్ అధికారులు డి.ఎస్.పి ముత్యాల నాయుడు ఆధ్వర్యంలో ఆకస్మికంగా దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

రైస్ మిల్లు లీజుకు తీసుకుని నిర్వహిస్తున్నవారు పిడిఎస్ బియ్యం తీసుకువచ్చి వాటిని పాలిష్ చేసి ఎగుమతి చేస్తున్నట్టు సమాచారం. ఈ దాడులలో పిడిఎస్ బియ్యం తో అశోక్ లేలాండ్ వ్యాన్ మిల్లు వద్ద గల ఐదు ధాన్యం లాట్లను లెక్కించవలసి ఉందని అలాగే మిల్లు లోపల ఉన్న సరుకునంత లెక్కించాలని డిఎస్పి ముత్యాల నాయుడు తెలియజేశారు.

Related posts

పిచ్చి సినిమాలు తీయడం మానుకో రామ్ గోపాల్ వర్మ

Satyam NEWS

బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరి బాధ్యత

Satyam NEWS

పాకిస్తాన్ ను దిగజారుస్తున్న పాలకుల వైఖరి

Bhavani

Leave a Comment