కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా నిరుపేదలు, వలసకూలీలు ఆకలి తో అలమటించకూడదనే ఉద్దేశ్యం తో ప్రతిరోజూ నేషనల్ హైవే పై వెళ్తున్న వలసకూలీలకు, నిరుపేదలకు ఆహర పొట్లాలు అందిస్తున్నామని PYL రాష్ట్ర నాయకులు సుమన్ తెలిపారు. పార్టీ సానుభూతిపరులను, మిత్రులను కోరగానే స్పందించి విరాళాలు ఇచ్చారని ఆయన అన్నారు.
మచ్చర్ల పార్టీ గ్రామ శాఖ, సానుభూతిపరులు రైతు కూలీ సంఘం కార్యదర్శి రాజన్న యువజన సంఘం నాయకులు సతీష్, సానుభూతిపరులు అమితాబ్ జగదీష్ నరసయ్య తదితరులు మూడు క్వింటాళ్ల సేకరించి పంపినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.
ఆహార పొట్లాల పంపిణీ, బియ్యం సేకరణ కార్యక్రమంలో ప్రగతిశీల యువజన సంఘం డివిజన్ అధ్యక్షుడు రాకేష్ కార్యదర్శి నిమ్మల నిఖిల్ ప్రసాద్ పి డి ఎస్ యు నాయకులు సాయి కుమార్ పాల్గొన్నారు.