37.2 C
Hyderabad
March 29, 2024 19: 08 PM
Slider పశ్చిమగోదావరి

క్రికెట్ బెట్టింగ్ లకు అడ్డా పెదవేగి గడ్డ

#cricketbettings

పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం కూచింపూడి గ్రామం క్రికెట్ బెట్టింగ్ లకు అడ్డాగా మారింది. సాయంత్రమైతే చాలు యువకులు పగలంతా తాము సంపాదించిన డబ్బును బెట్టింగ్ లలో పెట్టి పోగొట్టు కుంటున్నారు.

కూచింపూడి, న్యాయం పల్లి, రామసింగ వరం గ్రామాల  నుండి పెద్ద ఎత్తున యువకులు, విద్యార్థులు, తాపీ కార్మికులు, వ్యవసాయ కూలీలు ఈ బెట్టింగ్ లలో పాల్గొని అప్పుల పాలైపోతున్నారు. ఒక్కొక్క సారి వాళ్లలో వాళ్ళకే విభేదాలు ఏర్పడి గొడవలకు గురౌతున్నారు.

ఈ బెట్టింగ్ ల కారణం గానే న్యాయం పెళ్లికి చెందిన ఓ యువకుడు ఏడాది క్రితం పొలాలను కూడా తాకట్టు పెట్టి సర్వం కోల్పోయి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసింది. ఈ బెట్టింగ్ లను అదుపు చేయడానికి పెద వేగి పోలీసులు ఎంత కృషి చేసిన యువత పోలీసుల కళ్ళు గప్పి బెట్టింగ్ లకు పాల్పడుతున్నారు.

ఈ బెట్టింగ్ ల వల్ల ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా సర్వ నాశనం ఐపోతున్నాయని గ్రామస్తులు తెలుపుతున్నారు. ఈ బెట్టింగ్ ల వల్ల ప్రతిరోజు లక్షల్లో డబ్బులు చేతులు మారి  యువత నష్టాల పాలై బెంబేలెత్తుతున్నట్టు తెలిసింది. 

యువత పెడదారులు పట్టి దీంతో దొంగతనాలకు కూడా పాల్పడే అవకాశం ఉందని బెట్టింగ్ లకు పాల్పడే యువత తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.

బెట్టింగ్ ల వల్ల ఆస్తి నష్టం తో పాటు ప్రాణ నష్టం జరగకుండా యువత కు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం యువత తల్లిదండ్రులపై ఉందని పలువురు అభిప్రాయం పడుతున్నారు.

Related posts

కరోనా బాధిత కుటుంబాలకు సీతక్క సాయం

Satyam NEWS

ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది

Bhavani

తెలంగాణ ఉద్యమ నేత జూపల్లి మరో ఉద్యమానికి సిద్ధం?

Satyam NEWS

Leave a Comment