36.2 C
Hyderabad
April 24, 2024 19: 57 PM
Slider పశ్చిమగోదావరి

పెదవేగి ఎంపిపిగా తాతా రమ్య ప్రమాణస్వీకారం రేపు

#ramya

పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి ఎం పి పి గా శుక్రవారం నాడు తాతా రమ్య ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎం పి పి గా తాతా రమ్య ను, ఉప ఎం పి పి గా మేడికొండ ఉమాదేవి లను ఎంపిక చేసినట్లు దెందులూరు శాసనసభ్యులు కొఠారు అబ్బయ్య చౌదరి ప్రకటించారు.

ఎం పి పి, వై స్ ఎం పి పి ల తో పాటు 22 మంది ఎం పి టి సి లు రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. శుక్రవారం ఎం పి పి గా ప్రమాణం చేయనున్న  తాతా రమ్య పెదవేగి వైద్యాధికారి తాతా ప్రసన్నకుమార్ సతీమణి కాగా వై స్ ఎం పి పిగా ప్రమాణం చేయనున్న మేడి కొండ ఉమాదేవి గార్లమడుగు మాజీ సర్పంచ్, దెందులూరు నియోజక వర్గ స్థాయి వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మెడికొండ కృష్ణారావు సతీమణి.   

ఎం పి పి, వై స్ ఎం పి పి లు మహిళలే కావడం విశేషం. స్థానిక శాసన సభ్యులు కోఠారు అబ్బయ్య చౌదరి సారథ్యం లో   ఈ ఇరువురు మహిళా ప్రజా ప్రతినిధుల నేతృత్వం లో పెడవేగి మండలం సర్వతోముఖాభివృద్ది జరుగుతుందని మండల ప్రజలు ఆశిస్తున్నారు.

Related posts

ఉచిత కంటి పొర చికిత్స శిబిరాన్ని సందర్శించిన మంత్రి రోజా

Satyam NEWS

ఈ నెల 7 నుంచి “జగనన్నే మా భవిష్యత్తు”..!

Bhavani

ప్రభుత్వ ఉగ్రవాద చర్యల పై చంద్రబాబు దీక్షకు మద్దతు

Satyam NEWS

Leave a Comment