పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి ఎం పి పి గా శుక్రవారం నాడు తాతా రమ్య ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎం పి పి గా తాతా రమ్య ను, ఉప ఎం పి పి గా మేడికొండ ఉమాదేవి లను ఎంపిక చేసినట్లు దెందులూరు శాసనసభ్యులు కొఠారు అబ్బయ్య చౌదరి ప్రకటించారు.
ఎం పి పి, వై స్ ఎం పి పి ల తో పాటు 22 మంది ఎం పి టి సి లు రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. శుక్రవారం ఎం పి పి గా ప్రమాణం చేయనున్న తాతా రమ్య పెదవేగి వైద్యాధికారి తాతా ప్రసన్నకుమార్ సతీమణి కాగా వై స్ ఎం పి పిగా ప్రమాణం చేయనున్న మేడి కొండ ఉమాదేవి గార్లమడుగు మాజీ సర్పంచ్, దెందులూరు నియోజక వర్గ స్థాయి వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మెడికొండ కృష్ణారావు సతీమణి.
ఎం పి పి, వై స్ ఎం పి పి లు మహిళలే కావడం విశేషం. స్థానిక శాసన సభ్యులు కోఠారు అబ్బయ్య చౌదరి సారథ్యం లో ఈ ఇరువురు మహిళా ప్రజా ప్రతినిధుల నేతృత్వం లో పెడవేగి మండలం సర్వతోముఖాభివృద్ది జరుగుతుందని మండల ప్రజలు ఆశిస్తున్నారు.