పెద్దపల్లి జిల్లాలోని హనుమంతునిపేట శివారులో ఓ ప్రైవేటు పాఠశాల కు చెందిన టాటా మ్యాజిక్ ఆటో మంగళవారం విద్యార్థులను ఎక్కించుకొని పాఠశాలకు వెళ్తుండగా అదుపు తప్పి బోల్తా పడి అందులో ప్రయాణిస్తున్న విద్యార్థులు గాయపడ్డారు.పెద్దపల్లిలోని మాస్టర్ సిద్దార్థ పాఠశాలకు చెందిన వ్యాన్ లో మంగళవారం ఉదయం వివిధ గ్రామాల నుంచి విద్యార్థులను పాఠశాలకు తీసుకువస్తుండగా జరిగిన ప్రమాదం లో 15 మంది విద్యార్థులకు స్వల్పగాయాలయ్యాయి.
ప్రమాద సమయంలో బస్సులో 25 మంది విద్యార్థులు ఉన్నారు. గాయపడిన విద్యార్థులను 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అదృష్టవశాత్తూ ఎవరికీ తీవ్రగాయాలు కాలేదని వైద్యులు తెలిపారు. విద్యార్థులను పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, ఏసీపీ హబీబ్ ఖాన్ లు పరామర్శించి మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు.సంఘటన స్థలంలో విద్యార్థులా ,వారి తల్లి దండ్రుల రోదనలు పలువురిని కలిచి వేసాయి.