గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మునిసిపాలిటీకి రెండో వైస్ చైర్మన్ గా ఎన్నికైన నసీమా జలాలుద్దీన్ నేడు గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని కలిశారు.
తనను వైస్ చైర్మన్ గా ఎంపిక చేసినందుకు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్రంలోని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మైనారిటీలకు పెద్ద పీట వేస్తుందనడానికి ఇది నిదర్శనమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు.
పిడుగురాళ్ల ప్రజల ఆకాంక్షల మేరకు, ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఆదేశాల మేరకు తాను పని చేస్తానని జలాలుద్దీన్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల ఆటో నగర్ ప్రెసిడెంట్ హాజీ కరీముల్లా మేస్త్రి, మైనారిటీ నాయకులు వార్డ్ కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.