కరోనా కలంలో సమాజ శ్రేయస్సు కోసం తన వంతు సహాయం చేస్తున్న ప్రఖ్యాత సినీ నటుడు సోను సూద్ ను పెన్సిల్ తో ఆవిష్కరించారు ఇద్దరు చిన్నోళ్లు.
ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో బాటు ఇతర ప్రముఖుల చిత్రాలను పెన్సిల్ తో గీస్తున్న కుందన్, కార్తీక్ ఇప్పుడు తమ పెన్సిల్ తో సోను సూద్ ను ఆవిష్కరించారు.
కరోనా కాలంలో ఈ చిత్ర కళా సోదరులు 70కి పైగా పెన్సిల్ చిత్రాలు వేసి అందర్నీ ఆకట్టుకున్నారు.
పోలీసులు, డాక్టర్లు, నర్సులు, జర్నలిస్టులు, జిఎంసిహెచ్ అధికారులు ఇలా ఎంతో మంది పెన్సిల్ చిత్రాలను వీరు వేసారు.
పెన్సిల్ చిత్రాలు బాగా వేస్తున్న కుందన్, కార్తీక్ లను స్కూల్ హెడ్ మాస్టర్ బి.అమరశేఖర్ రెడ్డి సైతం మెచ్చుకున్నారు.