28.7 C
Hyderabad
April 20, 2024 02: 59 AM
Slider నిజామాబాద్

పెండింగ్ స్కాలర్ షిప్ లను వెంటనే విడుదల చేయాలి

#abvp

పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్ లను వెంటనే విడుదల చేయాలని కామారెడ్డి జిల్లా బిచ్కుంద ఎమ్మార్వో కి అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ వినతి పత్రం సమర్పించింది. ఈ సందర్భంగా విభాగ్ మహిళా కన్వీనర్ సారిక మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న 3860 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ ని వెంటనే విడుదల చేయాలని కోరారు. లేకపోతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉద్యమాలు చేస్తుందని తెలంగాణ ప్రభుత్వానికి హెచ్చరించారు.

ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉందో అది విద్యార్థుల ప్రథమ హక్కు అని ఆమె తెలిపారు. అది విద్యార్థుల సొమ్ము కాబట్టి అది ఆపే అధికారం ప్రభుత్వానికి లేదని కావున వెంటనే దీని పైన స్పందించి విద్యార్థుల ఫీజులను అతి త్వరలో చెల్లించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముప్పిడి వెంకట్ ఎస్ ఎఫ్ డి కన్వీనర్ అనిల్ నాగరాజ్ సునీత పాల్గొన్నారు.

జీ లాలయ్య సత్యం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం

Related posts

వైద్యశాఖ ఆధ్వర్యంలో ‘ఆలన వాహనం’ ప్రారంభం

Satyam NEWS

తుడా సెక్రటరీగా జి.వెంకట నారాయణ బాధ్యతలు స్వీకరణ

Satyam NEWS

కరోనా డ్యూటీలలో అలసత్వం వద్దు: ప్రకాశం జిల్లా ఎస్ పి

Satyam NEWS

Leave a Comment