రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని ఎస్ఎఫ్ఐ ఉప్పల్ అధ్యకులు ఖాసీంజాలం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత సం,, బడ్జెట్లో 6 శాతానికి మించకుండా విద్యకు నిధులు కేటాయించారన్నారు.
గత మూడు సవంత్సరముల పెండిరగ్ బకాయిలు వేల కోట్ల పేరుక పోయాయన్నారు. పెండిరగ్ బకాయిలను వెంటనే విడుదల చేయక పోవడం వలన పేద, మద్యతరగతి విద్యార్ధులు పై చదువులకు వెళ్ల లేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పెండిరగ్ లో ఉన్న స్కాలర్ షిఫ్లు వెంటనే విడుదల చేయాలన్నారు. హాస్టల్లో విద్యార్ధులకు పెరిగిన ధరలకు అణుగుణంగా మెస్ చార్జీలు పెంచి ఇవ్వాలని లేనిచో విద్యార్ధి ఉధ్యమాన్ని ఉదృతం చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాప్రా మండల ఇంచార్జి సాయిఉత్తేజ్, సాయినాద్, తదితరులు పాల్గొన్నారు.