ఉప్పల్ డివిజన్ లో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే చేపట్టాలని అధికారులను కార్పొరేటర్ మందముళ్ళ రజితపరమేశ్వర్ రెడ్డి కోరారు. ఉప్పల్ డివిజన్ కు సంబంధించిన అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం సోమవారం ఉప్పల్ సర్కిల్ కార్యాలయంలో జరిగింది.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ అభివృద్ధి పనుల పెండింగ్తో కాలనీల్లో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నయని వాటికి వెంటనే పనులను చేపట్టి సకాలంలో పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఉప్పల్ డిప్యూటీ కమిషనర్ అరుణకుమారి , ఈఈ నాగేందర్ , డీఈ నిఖిల్ రెడ్డి , ఏఈ వసంత తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్ సత్యం న్యూస్ ప్రతినిధి