బిచ్కుంద మండలంలోని చిన్న దడిగి గ్రామంలో పెన్షన్ పంపిణీ ప్రక్రియలో భాగంగా సర్పంచ్ అనిత విట్టల్ రెడ్డి పెన్షన్ దారుల ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్లను పంపిణీ ప్రక్రియను చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వం ఇళ్ల వద్దకే పెన్షన్లు అందిస్తుందని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
ఇంటికి వచ్చిన తపాలా అధికారులకు సిబ్బందికి గ్రామస్తులు పెన్షన్ దారులు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు రైతు సమన్వయ సమితి అధ్యక్షులు విఠల్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి రాజరత్నం తపాలా సిబ్బంది పాల్గొన్నారు.