తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో అమరావతి రాజధాని పెనుమాక ఐకాస ఆధ్వర్యంలో అమరావతి రైతుల నిరసన దీక్ష 338 వ రోజు గురువారం నిర్వహించారు.
మూడు రాజధానులకు వ్యతిరేకంగా, ఒకే రాజధాని అమరావతి అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని, పెనుమాక గ్రామ బొడ్రాయి సెంటర్ వద్ద నినదించారు.
ఈ నిరసన కార్యక్రమంలో రైతులు కళ్ళం రాజశేఖరరెడ్డి, షేక్ సాబ్ జాన్, ముప్పేర మాణిక్యాలరావు, గుంటక సాంబిరెడ్డి, గోగినేని నాగేశ్వరరావు, కడియం నాగరాజు, మాదల లక్ష్మీనారాయణ, మన్నవ సుబ్బారావు, పలగాని వెంకటేశ్వర్లు, కళ్ళం రామిరెడ్డి
తదితర రైతులు పాల్గొన్నారు.