30.7 C
Hyderabad
April 24, 2024 00: 25 AM
Slider నల్గొండ

పుకార్లు వీడండి….నిజాన్ని గ్రహించండి

#Corona Death

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో శ్రీ వేణుగోపాల శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి ఆలయ సమీపంలో శుక్రవారం ఓ మహిళ అనారోగ్య కారణంగా మృతి చెందింది. ఈ మహిళ కొంత కాలంగా దీర్ఘకాలిక  వ్యాధులతో  వైద్యం పొందుతూ మృతి చెందింది.

అప్పటి వరకు కలిసి మెలసి ఉన్న ఆ ప్రాంత వాసులు సహితం ‘కరోనా’అన్న అనుమానంతో దరిచేరలేదు. హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో  కరోనా వైరస్ కరాళ విలయ తాండవం చేస్తుండడంతో స్థానిక ప్రజలు కరోనా వైరస్ తో మృతి చెందింది అని పుకార్ల భయ బ్రాంతులకు గురై ఎవరికి వారు ఆమె వద్దకు వెళ్ళ లేదు. విషయం మున్సిపాలిటీ సిబ్బందికి మరియు అధికారులకు సమాచారం ఇచ్చారు.

స్థానిక మున్సిపల్ సిబ్బంది సమాచారం తెలుసుకున్న తక్షణమే ఆ ప్రదేశానికి చేరుకుని ఆ మహిళా మృతదేహాన్ని తీసుకెళ్లి దహన సంస్కారాలు దగ్గర ఉండి నిర్వహించారు. కరోనా వైరస్ పుకార్లు కూడా మనుషులలోని మానవత్వాన్ని మంటకలుపుతుంది అనటానికి ఇంతకన్నా ఉదాహరణ ఏముంటుంది.

Related posts

రక్షాబంధన్ పండుగను ఘనంగా జరుపుకున్న చిన్నారులు

Satyam NEWS

ఇంటింటా ఇన్నోవేటర్ ఆవిష్కరణల ఆన్లైన్ ప్రదర్శన

Satyam NEWS

ఆసియా కప్ టైటిల్ గెలుచుకున్న శ్రీలంక

Satyam NEWS

Leave a Comment