పరిసరాల పరిశుభ్రతపై ప్రజలు కూడ శ్రద్ధ చూపాలని కాచిగూడ డివిజన్ కార్పొరేటర్ కన్నె ఉమారమేష్ యాదవ్ అన్నారు. బుధవారం కాచిగూడ డివిజన్, నింబోలి అడ్డ అమ్మవారి గుడి నుండి రైల్వే ట్రాక్, బండల్ బస్తి, చప్పల్ బజార్, రహమత్ బాగ్, మౌలానా ఆజాద్ నగర్ తదితర ప్రాంతాల్లో కాచిగూడ కార్పొరేటర్, బీజేపీ సీనియర్ నాయకులు కన్నే రమేష్ యాదవ్, జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ నోడల్ ఆఫీసర్ ఉమా ప్రకాష్, ఎ.ఎం.ఓ.హెచ్ జ్యోతి భాయి, లాల్ బహుదూర్ స్కూల్ విద్యార్థులతో కలిసి పారిశుద్ధ్య సమస్యపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్పొరేటర్ కన్నే ఉమారమేష్ యాదవ్ మాట్లాడుతూ వీధుల్లో ఎక్కడపడితే అక్కడ ఇష్టం వచ్చినట్లు రోడ్డుపై చెత్త పడేయకుండా ఇంటింటికి వచ్చే స్వచ్ఛ్ ఆటో లో చెత్త వెయ్యాలని దీని ద్వారా మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచినట్లు అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్, సుభాష్ పటేల్, అరవింద్, మల్లికార్జున్,బల్ వీర్, భీమ్ రాజ్, ఆర్.సంతోష్, రవి యాదవ్, సూరి, రాము, నాగ రాజ్, శైలేందర్, నందు, చందు, రాంకీ సంస్థ ప్రతినిధులు, జీహెచ్ఎంసీ ఎస్ఎఫ్ఏలు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట