మునుగోడు విజయం సీయం కేసీఆర్ నాయకత్వంపై ఉన్న విశ్వాసానికి నిదర్శనం అని , తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలకు స్థానం లేదని మరోసారి స్పష్టమైందని, బీఆర్ఎస్ జైత్రయాత్రకు మునుగోడు గెలుపే నాంది కానుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. మునుగోడు లో గెలిచిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన అనంతరం మాట్లాడుతూ మునుగోడు విజయం ద్వారా ప్రజలకు ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వం పైన ఉన్న విశ్వాసానికి నిదర్శనంగా నిలిచిందని, గత కొంతకాలంగా ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేసిన విమర్శలకు ప్రజలే ఓట్ల రూపంలో సమాధానం చెప్పారన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు, కుయుక్తులు పన్నినా ఎప్పటికీ ధర్మంమే గెలుస్తుందని మునుగోడు ప్రజలు నిరూపించారని మంత్రి పువ్వాడ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీ దేశ వ్యాప్త జైత్రయాత్రకు మునుగోడు గెలుపే నాంది కానుందని, దేశ రాజకీయాలలో ముందుకు నడిచేందుకు మునుగోడు విజయం ద్వారా ప్రజలు తమ ఆమోదం తెలిపారని పేర్కొన్నారు. దేశ రాజకీయాల్లో కూడా కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ఖచ్చితంగా ప్రధాన పాత్ర పోషించనుందని, ఈ దేశానికి తెలంగాణ ఒక దిక్సూచిగా నిలవనుందని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలకు స్థానం లేదని, తెలంగాణలో ఉన్నది టీఆర్ఎస్ మాత్రమే అని మరోసారి నిరూపితమైందన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేసిన ఖమ్మం ప్రజాప్రతినిధులకు, కార్పొరేటర్లకు, నాయకులకు, కార్యకర్తలకు, టీఆర్ఎస్ శ్రేణులకు పేరుపేరునా దన్యవాదాలు తెలిపారు.
previous post