తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పిలుపు మేరకు,రాష్ట్రంలో జరుగుతున్న ““ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి” కార్యక్రమాన్ని 25 వ రోజు పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని గణపవరం గ్రామంలోని 4వ వార్డు , 26వ బూత్ లో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గంగా శ్రీనివాసరావు టిడిపి నాయకులు, కార్యకర్తలతో కలిసి వీధివీధి తిరిగి ప్రజలతో మాట్లాడరు.
ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం ఈ మూడున్నర ఏళ్ళలో తీసుకున్న ప్రతీ జనాగ్రహ నిర్ణయాలపై రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజానీకం తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారని, వారి అ సంతృప్తి మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ తరపున నిర్వహించిన “బాదుడే బాదుడు ” కార్యక్రమం లో బాగా వెళ్ళడయిందని ఇప్పుడు ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమం ద్వారా మరింతగా జగన్ ప్రభుత్వంపై ప్రజాగ్రహం కనిపిస్తోందని, ఖచ్చితంగా రాబోయే ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ భారీ విజయం సాధించి ముఖ్య మంత్రి గా నారా చంద్రబాబు నాయుడు కు ప్రజలు పట్టం కట్టడం ఖాయం అని మాట్లాడటం జరిగింది.
కార్యక్రమములో 5 వ వార్డు ఇంచార్జి షేక్ హుస్సేన్,చుండూరి క్రిష్ణ ,దామచర్ల కిషోర్ ,పోతవరం మాధవ , తుబాటి శివకృష్ణ ,ముప్పరాజు వెంకటేష్,సుధీర్.అట్లూరి అనీల్ తదితరులు పాల్గోన్నారు.