పీపుల్స్ మార్చ్ బహిరంగ సభను విజయవంతం చేయాలని చిమ్ముల శ్రీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో గురువారం జరిగే పీపుల్స్ యాత్ర బహిరంగ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చిమ్ముల శ్రీకాంత్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల లో నిర్వహిస్తున్న పీపుల్స్ మార్చ్ యాత్ర బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్ రావు ఠాక్రే పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఏఐసీసీ కార్యదర్శి కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీ చందర్ రెడ్డి తదితర ముఖ్య నాయకులు పాల్గొంటున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
previous post
next post