భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు టీ20ల సిరీస్ ప్రారంభమైంది. ఈ సిరీస్లో భాగంగా జైపూర్లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. ఇప్పుడు రెండో మ్యాచ్ రాంచీలోని జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్పై సంక్షోభ మేఘాలు కమ్ముకున్నాయి.
ఈ మ్యాచ్ నిర్వహణపై జార్ఖండ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. భారత్-న్యూజిలాండ్ల మధ్య జరగనున్న రెండో టీ20 మ్యాచ్ను వాయిదా వేయాలని లేదా స్టేడియంలో సగం సామర్థ్యంతో మ్యాచ్ నిర్వహించేందుకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ జార్ఖండ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మ్యాచ్లో ప్రేక్షకులకు 100శాతం సీట్లు తెరవడాన్ని వ్యతిరేకిస్తూ జార్ఖండ్ హైకోర్టుకు చెందిన న్యాయవాది ధీరజ్ కుమార్ జార్ఖండ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
రాష్ట్రంలోని దేవాలయాలు, అన్ని కోర్టులు, ఇతర కార్యాలయాలు కూడా 50 శాతం మంది సిబ్బందితో కరోనా వైరస్కు సంబంధించి పని చేస్తున్నప్పుడు, 100 శాతం సామర్థ్యం ఉన్న క్రికెట్ స్టేడియంను ఉపయోగించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ నియమం ప్రకారం అనుమతి ఇచ్చిందని ఆయన అన్నారు. రేపటి మ్యాచ్ను వాయిదా వేయాలని లేదా 100 శాతం సామర్థ్యంతో స్టేడియం వినియోగాన్ని నిషేధించాలని పిటిషన్లో డిమాండ్ చేశారు.
ఈ పిటిషన్ దరిమిలా కోర్టు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను నిలిపివేసేందుకు వీలుంది. రెండు రోజుల క్రితం న్యూజిలాండ్ వర్సెస్ భారతదేశం మధ్య క్రికెట్ మ్యాచ్ కోసం స్టేడియంలోని 50 శాతం సీట్లను మాత్రమే బుక్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. అయితే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించి, అన్ని సీట్లను కేటాయించింది.