విద్యార్థులకు ఉత్తమ బోధన బోధించి వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులది కీలకపాత్ర అని, సావిత్రిభాయీ ఫూలే మొట్టమొదటి ఉపాధ్యాయురాలిగా సేవలందించడం గర్వించదగ్గ విషయమని కందూకూరు టీఆర్ఎస్ ఉపాధ్యక్షులు సామ మహేందర్రెడ్డి కొనియాడారు.
సావిత్రాభాయీ ఫూలే 139వ జయంతి సందర్భంగా సామ మహేందర్ రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఫూలే చేసిన సేవలను కొనియాడారు. జ్యోతిభాయీ ఫూలే విద్యార్థులకు ఆదర్శప్రాయమైన, గౌరవ ప్రదమైన, అనిర్వచనీయమైన బోధనను అందించారన్నారు. ఆమె అడుగుజాడల్లో నడుస్తూ ప్రతీ ఒక్కరూ దేశం కోసం పాటుపడాలని స్పష్టం చేశారు.