కుల వివక్ష కు వ్యతిరేకంగా సమసమాజం కోసం పోరాడిన న బహుజన సాంస్కృతిక విప్లవ స్ఫూర్తి ప్రదాత మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆదివారం సైనిక్ పురి చౌరస్తాలోని మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తిరుపతయ్య సేవ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప్పల్ శాసనసభ్యులు బేతి సుభాష్ రెడ్డి, ఏఎస్ రావునగర్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష శేఖర్ రెడ్డి, కాప్రా కార్పొరేటర్ స్వర్ణ రాజు శివమణి, హెచ్ బి కాలనీ కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభాదాస్, మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ కాప్రా డివిజన్ అధ్యక్షుడు సుడుగు మహేందర్ రెడ్డి, ఏఎస్ రావునగర్ డివిజన్ అధ్యక్షుడు మహిల్ రెడ్డి, తిరుపతయ్య సేవ ఆర్గనైజేషన్ కోటకొండ అవినాష్ కార్యదర్శి సిహెచ్ మల్లేష్ ముదిరాజ్ న్యాయవాది భాస్కర్ ముదిరాజ్, పెంచాల సురేందర్, భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు. సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి
previous post