నాల్గో విడత పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులు ,వృధ్ధులు ఓటేసేందుకు పడ్డ అవస్థలు వర్ణణాతీతం.పోలింగ్ కేంద్రాల వద్ద ఓటేసేందుకు ఇబ్బందులు పడుతూ మీడియా కు కనిపించారు.ఈ మేరకు గజపతి నగరం నియోజకవర్గ పరిధిలో జెడ్పీ హైస్కూల్ లో ఓ వృధ్ధురాలు ,ఓ వికలాంగుడు ,ఓ పెద్దాయన… అవస్థలు పడుతు..మరొకరి సహాయం తో పోలింగ్ కేంద్రం వద్ద వరకూ ఇబ్బందులు పడుతూ వచ్చారు.ఇక్కడ కూడా పోలింగ్ ప్రారంభమై రెండుగంటలు..14 శాతం పోలింగ్ నమోదైంది.
మీడియా వాహన డ్రైవర్ పై ఖాకీ రుసరుస..!
ఇక్కడే పోలింగ్ ను కవరేజ్ చేయడానికి జిల్లా నుంచీ వచ్చిన మీడియా వాహన డ్రైవర్ పై అక్కడే బందోబస్తు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ ఫైర్ అయ్యారు. తమ పై స్థాయి అధికారులు వస్తున్నారని వాహనాన్ని తీయాలని డ్రైవర్ పై చిందులు తొక్కారు.