లాక్ డౌన్ సందర్భంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న దివ్యాంగులకు వారి కుటుంబాలకు ఉప్పల్ నియోజకవర్గం టిఆర్ఎస్ సీనియర్ నాయకులు బండారి లక్ష్మారెడ్డి , బీఎల్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ చేశారు. సైనిక్ పురి ఆఫీస్ లో కాప్రా సర్కిల్ కు చెందిన పలువురు దివ్యాంగులకు నిత్యావసర వస్తువులను అందుకున్నారు. బియ్యం, నూనె, కందిపప్పు, చింతపండు, పంచదారతో పాటు ఇతర వస్తువులను ఆయన అందజేశారు.
ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఉపాధి లేని కారణంగా చాలామంది ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. వారి కష్టాలను చూసి తన వంతు సహాయం చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఇంద్రయ్య నవీన్ గౌడ్, భాస్కర్, మహేష్ గౌడ్, రహీం, శ్రీకాంత్ గౌడ్, సుజాత తదితరులు పాల్గొన్నారు.