మీ సమస్యలపై మీరే పోరాడాలి…మీకు దన్నుగా మీ సంస్థ ఉంటుందని విజయననగరంలో దివ్యాంగుల పరరిక్షణ సేవాసమితి పేర్కొంది. ఈ మేరకుఉ దివ్యాంగుల పరిరక్షణ సేవాసమితి ఆధ్వర్యంలో వరల్డ్ విజన్ ఇండియా సహకారంతో గంట్యాడ మండలం తామరపల్లి కళ్యాణ మండపంలో గంట్యాడ దివ్యాంగుల మండల కమిటీ సమావేశం జరిగింది
ఈ సమావేశంలో అధ్యక్షుడు సిరిపురం దివ్యాంగుల గ్రామ ప్రెసిడెంట్ చింతలపూడి కృష్ణ మాట్లాడుతూ దివ్యాంగుల అభివృద్ధి నిమిత్తం దివ్యాంగుల అందరు సహకరించాలన్నారు. దివ్యాంగుల హక్కులు, రాయితీలు ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాల గురించి వారికి తెలియ చేసారు.
ఈ కార్యక్రమంలో మండల సెక్రెటరీ డీ జే రాజు, దివ్యాంగుల పరిరక్షణ సమితి జిల్లా కార్యదర్శి కానూరు శంకర్రావు, బొండపల్లి మండల అధ్యక్షులు ఎం గౌరీ శంకర్, కమిటీ సభ్యులు చంద్రు నాయుడు, మరియు కమిటీ సభ్యులు మురళి పాల్గొన్నారు.