దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ ఓజో ఫౌండేషన్ చైర్మన్ పిల్లుట్ల రఘు సోమవారం ఆంధ్రప్రదేశ్ సిఎం జగన్ మోహన్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.
దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రజా,రాజకీయ జీవితాన్ని విశ్లేషిస్తూ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, రచయిత,జర్నలిస్ట్ విజయార్కె రాసిన చిరస్మరణీయుడు మేకపాటి గౌతమ్ రెడ్డి పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ సిఎం క్యాంప్ కార్యాలయంలో సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు.
ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసి,రాష్ట్ర అభ్యున్నతికి విశేషంగా కృషి చేసి, ప్రజల మనసు గెలుచుకున్న గౌతమ్ రెడ్డి హఠాత్ మరణం చేదండం మనందరికీ తీరని లోటని,తాను ఎన్నో స్వచంద సేవ కార్యక్రమాలు చేస్తూ ప్రజల నసులో చిరస్మణీయుడుగా నిలిచి పోయారని ఓజో ఫౌండేషన్ చైర్మన్ పిల్లుట్ల రఘు అన్నారు.పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఆత్మకూరు శాసనసభ్యుడు మేకపాటి విక్రమ్ రెడ్డి,పిల్లుట్ల రఘు హుజూర్ నగర్ నియోజకవర్గం,రచయిత డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి,మోచర్ల నారాయణరావు, పీర్ల పార్ధసారధి తదితరులు ఉన్నారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్