కామారెడ్డి జిల్లా పిట్లం మండలం లోని స్థానిక మార్కెట్ యార్డ్ లో మండల కేంద్రానికి చెందిన వ్యాపారస్తుల తో మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రావ్ పటేల్, సెక్రటరీ వజిరొద్దిన్ సమావేశం నిర్వహించారు.
తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు 2020-21 యాసంగి సీజన్లో వచ్చే వరి ధాన్యం కూడా సంబంధిత వ్యాపారస్తులే కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు.
మార్కెట్ యార్డ్ కు వచ్చే వరి ధాన్యాన్ని వ్యాపారస్తులు గతంలో ధాన్యం గింజలు కొనుగోలు చేసిన విధంగానే వరి ధాన్యాన్ని కూడా చేయాలని తెలిపారు.
ఎవరైనా ప్రస్తుతం ఉన్న లైసెన్స్ వ్యాపారస్తులు కాకుండా మరీ ఇంకా ఎవరైనా కొనుగోలు చేయాలనుకుంటే దరఖాస్తు చేసుకోవాలని ఆయన అన్నారు.
ఈ వ్యాపారస్తులు కూడా వరి కొనుగోలు చేయడానికి ముందుకు వస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పిట్లం మండల రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉడుగుల లక్ష్మణ్ , వ్యాపారస్తులు గంగ శ్రీనివాస్ , బేజుగం జగదీష్ , మండలి శ్రీనివాస్ , గంగ ప్రవీణ్ పాల్గొన్నారు.