పాకిస్తాన్ లో విమానం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో మొత్తం 90 మంది ప్యాసింజర్లతో బాటు ఎనిమిది మంది సిబ్బంది మరణించి ఉంటారని అనుకుంటున్నారు. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఏ320 ఎయిర్ క్రాఫ్ట్ కరాచీ విమానాశ్రయం సమీపంలోని మోడల్ కాలనీపై కూలిపోయింది. లాహోర్ నుంచి కరాచీ వెళుతున్న ఈ విమానం కూలిపోయినట్లు పిఐఏ అధికార ప్రతినిధి అబ్దుల్లా హఫీజ్ వెల్లడించారు.
మరణించిన వారిలో న్యూస్ 24 ఛానెల్ ప్రోగ్రామ్ డైరెక్టర్ అన్సార్ నఖ్వీ కూడా ఉన్నారు. విమానం సిబ్బంది ఎమర్జన్సీ ల్యాండింగ్ కోసం ప్రయత్నించినట్లుగా కనిపిస్తున్నదని ఆయన వెల్లడించారు. ఎంతో విలువైన 98 ప్రాణాలు కోల్పోయినందుకు ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బాజ్వా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పౌర అధికారులకు ఆర్మీ అవసరమైన సాయం అందిస్తుందని ఆయన వెల్లడించారు.