డివిజన్ పరిధిలో పలు ప్రాంతాల్లో మొక్కల పెంచాలని అర్బన్ బయో డైవర్సిటీ డైరెక్టర్ శ్రీనివాసరావు తో హబ్సిగూడ డివిజన్ కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీష్ కూలంకుశంగా చర్చించారు. ఈ సమావేశం బుదవారం ఇందిరాపార్క్ లోని అర్బన్ బయో డైవర్సిటీ కార్యాలయంలో జరిగింది.
ఈ సంద్భంగా మాట్లాడుతూ రామంతాపుర్ మెయిన్ రోడ్డులో కుండిలు ఏర్పాటుచేసి మొక్కలను పెంచాలని, రామంతాపుర్ పెద్దచెరువు సుందరీకరణలో భాగంగా చెరువు కట్టపైన మొక్కలను నాటడం, హబ్సిగూడ లోని గ్రీన్ హిల్స్ కాలనీలో గ్రీన్ బెల్ట్ ఆధునీకరించాలని , డివిజన్ లోని వివధ పార్క్ లలో మొక్కలను నాటాలని కార్పొరేటర్ చేతన వివరించారు. అర్బన్ బయో డైవర్సిటీ డైరెక్టర్ శ్రీనివాసరావు సానుకూలంగా స్పందించి త్వరలోనే సంబంధిత అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి